తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Last Updated : Aug 29, 2019, 11:15 AM IST
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 12723 నెంబర్ కలిగిన రైలులో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలు మరో రెండు గంటల్లో ఢిల్లీకి చేరుకుంటుందనగా హర్యానాలోని బల్లబ్‌ఘడ్‌ వద్ద రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. బ్రేక్ బైండింగ్ నుంచి చెలరేగిన మంటలు బోగీల్లోకి వ్యాపించాయి. అసవోటి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఉదయం 7:43 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే రైలుని నిలిపేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదని ఉత్తర రైల్వే సీపీఆర్వో తెలిపారు.  

సమాచారం అందుకున్న రైల్వే శాఖ సిబ్బంది హుటాహటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యాయని రైల్వే సిబ్బంది వెల్లడించారు. రైలుని పట్టాలపైనే నిలిపేయడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లపై ఈ ఘటన ప్రభావం చూపించింది.

Trending News