పుల్వామాలో మరోసారి ఎన్‌కౌంటర్.. నలుగురు సైనికులు మృతి!

పుల్వామాలో మరోసారి ఎన్‌కౌంటర్.. గాయపడిన నలుగురు సైనికులు మృతి!

Last Updated : Feb 18, 2019, 10:08 AM IST
పుల్వామాలో మరోసారి ఎన్‌కౌంటర్.. నలుగురు సైనికులు మృతి!

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి భద్రతా బలగాలపై దాడికి తెగబడ్డారు. పుల్వామా జిల్లా పింగ్లన్ ప్రాంతంలో 55 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన జవాన్లు, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్ సహా మొత్తం నలుగురు సైనికులు మృతిచెందారు. గురువారం నాడు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన స్థలానికి మరో 10 కిమీ దూరంలోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు లేక ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు తలదాచుకుని ఉండి ఉంటారని భావిస్తున్న భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి జల్లెడ పడుతున్నాయి. 

జీ న్యూస్ ప్రతినిథి మనిష్ శుక్లా వెల్లడించిన వివరాల ప్రకారం కడపటి వార్తలు అందే సమయానికి సైనికులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే వున్నాయని తెలుస్తోంది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x