Gold Price: మిశ్రమంగా బంగారం ధర.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) దుమ్మురేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బంగారం, వెండి గరిష్ట ధరలకు జులైలో నమోదవుతున్నాయి. మొన్న బంగారం ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు చేయగా, తాజాగా వెండి ఏకంగా రూ.52,000 మార్కు చేరుకోవడం గమనార్హం.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 12, 2020, 09:42 AM IST
Gold Price: మిశ్రమంగా బంగారం ధర.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు (Gold Rate Today) భిన్నంగా నమోదయ్యాయి. వెండి ధర మాత్రం పెరిగింది. నేడు హైదరాబాద్ (Gold Price In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.30 మేర బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,890కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.30 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.51,170కి పడిపోయింది. ఆ న్యూమోనియాకు కరోనా వైరస్ కారణం: డబ్ల్యూహెచ్‌వో

ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ పెరిగింది. రూ.100 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,000అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర పెరగడంతో 10 గ్రాములు రూ.47,800కి పెరిగింది.. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

నేడు బంగారం ధరలు మిశ్రమంగా ఉండగా.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. మార్కెట్‌లో వెండి ధర రూ.40 మేర భారీగా పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.52,000 అయింది. బులియన్ మార్కెట్‌లో తొలిసారిగా వెండి 52 వేల మార్క్ చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News