Corona cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత- 561 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు

Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్య మరోసారి 8 వేల దిగువన నమోదైంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 11:28 AM IST
  • క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
  • ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో మాత్రం వృద్ధి
  • దేశవ్యాప్తంపగా పెరిగిన రికవరీ రేటు
Corona cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత- 561 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు వరుసగా మూడో రోజూ 8 వేల దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,350 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,55,692 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది.

కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 202 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 7,973 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయపడ్డాయి.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 91,456 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. క్రియాశీల కేసులు 561 రోజుల కనిష్ఠానికి తగ్గడం గమనార్హం.

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.26 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,75,636 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,697,860 మందికి కరోనా సోకగా.. అందులో 3,41,30,768 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.37 శాతానికి పెరిగింది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 19,10,917 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇటీవలి కాలంలో ఇదే అత్యల్పం. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,33,17,84,462 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 270,431,174 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,322,096 మంది మహమ్మారికి బలయ్యారు. 243,147,436 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 21,961,642 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Omicron case in Kerala: కేరళలో తొలి ఒమిక్రాన్ కేసు.. దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Also read: Covid19 Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News