Good News: పెట్రోల్ పై రూ. 25 తగ్గించిన రాష్ట్రం.. జనవరి 26 నుండి అమల్లోకి..

Good News: ద్విచక్రవాహనదారులకు జార్ఖండ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లీటరు పెట్రోల్​పై రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 05:32 PM IST
  • ద్విచక్రవాహనదారులకు గుడ్ న్యూస్
  • జార్ఖండ్ లో లీటర్​ పెట్రోల్​పై రూ.25 రాయితీ
  • జనవరి 26 నుంచి అమలు
Good News: పెట్రోల్ పై రూ. 25 తగ్గించిన రాష్ట్రం..  జనవరి 26 నుండి అమల్లోకి..

Jharkhand Petrol Price: ద్విచక్రవాహనదారులకు గుడ్ న్యూస్. జార్ఖండ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25 తగ్గించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemant Soren) ప్రకటించారు. మోటార్​సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్​ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ (Petrol discount) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పెట్రో ధరల తగ్గింపు పేదలకు లేదా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. 

జార్ఖండ్‌లోని తన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం హేమంత్ సొరేన్ ఈ ప్రకటన చేశారు. ద్విచక్ర వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదు ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. గరిష్టంగా 10 లీటర్ల వరకు ఈ రాయితీ పొందవచ్చు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రేటు (Petrol Rates) దాదాపు వంద రూపాయలుగా ఉంది. ఓ పక్క ఒమిక్రాన్ తో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఇటువంటి సమయంలో జార్ఖండ్ ప్రభుత్వం (Jharkhand  Govt) తీసుకున్న నిర్ణయం సాహసమనే చెప్పాలి.  పెట్రో ధరల భారంతో విలవిల్లాడుతున్న వాహదారులకు ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం.  

Also Read: Auto Rides: కొత్త సంవత్సరంలో ఆటో రైడ్స్‌పై జీఎస్టీ.. సామాన్యులపై మరో భారం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News