ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఎన్నికల సంఘం

ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారుల బృందం

Last Updated : Apr 3, 2019, 07:09 PM IST
ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఎన్నికల సంఘం

బెంగళూరు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం బెంగుళూరు-హసన్ హైవేపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వాహనాన్ని ఆపిన ఎన్నికల సంఘం అధికారుల బృందం.. ఆ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లనిచ్చింది.

ఎన్నికల సంఘం అధికారుల బృందం వాహనాన్ని తనిఖీ చేస్తున్నంతసేపు ముఖ్యమంత్రి కుమారస్వామి తన ఎస్‌యువి వాహనం ముందు సీటులో కూర్చుని ఉండటాన్ని ఈ ఫోటోల్లో చూడవచ్చు. 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికార కూటమి జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల నివాసాలపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఐటి దాడులను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News