Air India Flight Crash: 20కి చేరిన మృతుల సంఖ్య

కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed )  మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

Last Updated : Aug 8, 2020, 08:55 AM IST
Air India Flight Crash: 20కి చేరిన మృతుల సంఖ్య

kozhikode flight accident: కొజికోడ్: కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ( Air India flight crashed )  మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20కి చేరిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ( Hardeep Singh Puri ) శనివారం ఉదయం తెలిపారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దురదృష్టవాత్తు 127 మంది ఆసుపత్రుల పాలయ్యారని, మిగతావారంతా సురక్షితంగా ఉన్నారని మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. Also read: Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్..

అయితే గమ్యస్థానానికి విమనాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. ఈ విమానంలో సిబ్బందితోసహా 190 మంది ఉన్నారు. ఈ ప్రమాదంపై డీజేసీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. Also read: Flight crash: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే

Trending News