Madras IIT: ఆ బ్యాండ్ ధరిస్తే చాలు..కరోనా ఉందో లేదో తెలుస్తుంది

కరోనా వైరస్ ను గుర్తించేందుకు ఇప్పుడు కొత్త రకం పరికరం అందుబాటులో వస్తోంది. దేశీయంగా రూపొందించిన ఈ బ్యాండ్ ధరిస్తే చాలు కరోనా వైరస్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే.

Last Updated : Jul 26, 2020, 10:20 AM IST
Madras IIT: ఆ బ్యాండ్ ధరిస్తే చాలు..కరోనా ఉందో లేదో తెలుస్తుంది

కరోనా వైరస్ ( Corona Virus ) ను గుర్తించేందుకు ఇప్పుడు కొత్త రకం పరికరం అందుబాటులో వస్తోంది. దేశీయంగా రూపొందించిన ఈ బ్యాండ్ ( Wrist Band ) ధరిస్తే చాలు కరోనా వైరస్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే.

కరోనా వైరస్ ను సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు వివిధ రకాల పరికరాలు మార్కెట్ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా లక్షణాల్ని ( Covid19 Symptoms ) ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. అందుకే ప్రతిష్టాత్మక చెన్నై ఐఐటీ ( IIT ) కొత్త రకం పరికరాన్ని త్వరలో మార్కెట్ లోకి తేనుంది. పూర్తిగా దేశీయంగా తయారైన ఈ పరికరం కేవలం ఒక బ్యాండ్ అంతే. దీన్ని చేతి రిస్ట్ కు కట్టుకుంటే చాలు..సదరు వ్యక్తి శరీర ఉష్ణోగ్రతతో పాటు గుండె, ఆక్సిజన్, రక్తం పనితీరును పూర్తిగా తెలుసుకోవచ్చు. Also read: Ram Nath Kovind: రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి

ప్రతిష్టాత్మకమైన మద్రాస్ ఐఐటీ ( Madras IIT ), మ్యుుస్ నియర్ బేల్స్ అనే ఓ స్టార్టప్ సంస్థ సంయుక్తంగా కరోనా లక్షణాల్ని గుర్తించే బ్యాండ్ ను త్వరలో మార్కెట్ లో తీసుకురానున్నాయి. ఈ బ్యాండ్ ధరను 3 వేల 5 వందల రూపాయలుగా నిర్ణయించారు. ఇదే బ్యాండ్ ను మొబైల్ ఫోన్, బ్లూటూత్ లతో అనుసంధానించవచ్చు. ఈ బ్యాండ్ ధరించిన వ్యక్తి కంటైన్ మెంట్ జోన్ లో ప్రవేశించగానే ఆరోగ్య సేతు యాప్ ను అలర్ట్ చేస్తుంది. ఈ ఏడాదికి 2 లక్షల బ్రాండ్ అమ్మకాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని...వచ్చే యేడాదికి దీన్ని 10 లక్షలకు పెంచుతామని మ్యుస్ నియర్ బేల్స్- మద్రాస్ ఐఐటీ తెలిపాయి. Also read: IIT Kharagpur: రూ.400లకే కరోనా టెస్టు..

 

Trending News