ప్రధాని నరేంద్ర మోదీకి మాయావతి వార్నింగ్

ప్రధాని నరేంద్ర మోదీకి మాయావతి వార్నింగ్

Last Updated : Apr 21, 2019, 06:11 PM IST
ప్రధాని నరేంద్ర మోదీకి మాయావతి వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ జనాన్ని ఫూల్స్‌ని చేసి వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. నరేంద్ర మోదీని ప్రధానిని చేసిన ఉత్తర్ ప్రదేశ్ వాసులే ఇప్పుడాయన్ని ప్రధాని పోస్ట్ నుంచి పక్కనపెట్టాలని చూస్తున్నారని మాయావతి ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీని ఉత్తర్ ప్రదేశ్ వాసులే ప్రధానిని చేశారని, ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్న అదే ఉత్తర్ ప్రదేశ్ జనం ఆయన్ని గద్దె నుంచి దించేయాలని భావిస్తున్నారని మాయావతి తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. 

2019 లోక్ సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీని ప్రధాని గద్దెపై నుంచి దించడం ఖాయమని మాయావతి హెచ్చరించారు.

Trending News