ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ దుర్మరణం

అస్సాంలో కూలిపోయిన తేలికపాటి విమానం.. ఇద్దరు పైలట్స్ దుర్మరణం

Last Updated : Feb 16, 2018, 11:58 AM IST
ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ దుర్మరణం

అస్సాంలో తేలికపాటి విమానం కూలిపోయిన దుర్ఘటనలో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్స్ దుర్మరణం పాలయ్యారు. రోజూవారీ విధుల్లో భాగంగానే గురువారం మధ్యాహ్నం సమయంలో గాల్లోకి ఎగిరిన తేలికపాటి విమానం.. ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిందని ఎయిర్ ఫోర్స్ అదికార వర్గాలు తెలిపాయి. 

ఈ దుర్ఘటనని సీరియస్‌గా తీసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించారు.

Trending News