ఈశాన్య రాష్ట్రాల్లో కమలం కల నెరవేరేనా ?

Last Updated : Mar 3, 2018, 04:25 PM IST
ఈశాన్య రాష్ట్రాల్లో కమలం కల నెరవేరేనా ?

దేశ వ్యాప్తంగా ప్రతీ చోట బీజేపీ ప్రభావం కనిపిస్తుంది..కానీ ఈశాన్య రాష్ట్రాల విషయంలో పరిస్థితి భిన్నం. అక్కడ బీజేపీకి  ఎప్పుడూ ఎదురుగాలే. అయితే అదంతా చరిత్ర...మోడీ చరిష్మాతో అక్కడ కూడా పాజిటివ్ ఫలితాలు వస్తాయంటున్నారు కమలనాథులు. అదే జరిగితే చరిత్రను తిరగరాసినట్టే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలతో దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లోనూ విజయందుందుభి మోగిస్తే మోడీ సర్కార్‌కు తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణమాలు బట్టి చూస్తే ఒక్క నాగాలాండ్‌లో మాత్రమే బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మేఘాలయలో పార్హీలు హంగ్ దిశగా సాగుతుంటే..త్రిపురలో వాపపక్షాలతో బీజేపీ హోరా హోరీగా తలపడుతోంది. 

 

Trending News