'పద్మావత్' చిత్ర ప్రదర్శనలపై జీ న్యూస్ సమగ్ర రిపోర్ట్..!

'పద్మావత్' సినిమా వివాదాస్పదమవుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బహిష్కరించడానికి శ్రీకారం చుట్టింది రాజపుత్ర కర్ణి సేన.

Last Updated : Jan 26, 2018, 09:51 AM IST
'పద్మావత్' చిత్ర ప్రదర్శనలపై జీ న్యూస్ సమగ్ర రిపోర్ట్..!

'పద్మావత్' సినిమా వివాదాస్పదమవుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బహిష్కరించడానికి శ్రీకారం చుట్టింది రాజపుత్ర కర్ణి సేన. వారణాసిలో ఓ రాజపుత్ర కులస్థుడు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆత్మహత్యకు ప్రయత్నించగా.. పలు చోట్ల థియేటర్ల లోపలకు వెళ్లకుండా రాజపుత్ర కర్ణిసేనల ప్రతినిధులు ప్రజలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో పద్మావత్ చిత్రం విషయానికి సంబంధించి జరుగుతున్న వివిధ ఘటనలపై జీ న్యూస్ రిపోర్ట్ మీకోసం

*'పద్మావత్'  చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని సుప్రీం కోర్టు ప్రకటించాక, వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. భారతదేశంలో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల చుట్టూ పోలీసులను మోహరించాలని కోర్టు ఇప్పటికే తెలియజేసింది

*ఢిల్లీలో ఈ సినిమాని నిరసిస్తూ ఇప్పటికే ఒక స్కూలు బస్సుపై దాడి చేశారు. అలాగే జైపూర్, నాసిక్, ముంబయి ప్రాంతాల్లో రహదారి మార్గాలను కర్ణిసేన వాలంటీర్లు బ్లాక్ చేశారు

*గుజరాత్‌లో 21 బస్సులపై దుండగులు దాడి చేసి తగులబెట్టారు. ఈ ఘటనలో 118 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వివిధ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 300 మందిపై కేసులు పెట్టారు. ఇప్పటికే గుజరాత్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 20,000 మంది పోలీసులను మోహరించారు. 

*రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో బెదిరింపులు విపరీతంగా రావడం వల్ల ఈ సినిమాను ప్రదర్శించేది లేదని మల్టీప్లెక్స్ ఓనర్లే ప్రకటించడం గమనార్హం

*అయితే, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు పలు దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రదర్శన పట్ల ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకపోవడంతో.. అక్కడ ప్రదర్శనలు ఎలాంటి అంతరాయం  లేకుండానే జరుగుతాయని సమాచారం

*ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ క్షత్రియ మహాసభ ఈ చిత్రాన్ని విమర్శిస్తూ.. ఈ చిత్రంలో పద్మావతి పాత్రలో నటించిన దీపిక పడుకొనే ముక్కు కోసేవారికి భారీ నగదు బహుమతి ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం

*లక్నోలో పద్మావతి చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద కర్ణిసేన సభ్యులు అందరికీ రోజాపూలు పంచుతూ వినూత్న రీతిలో నిరసనను తెలిపారు.

*మోదీ ప్రభుత్వానికి పకోడీ పాలిటిక్స్ అని, ఈ విషయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న వారిని ఆయన ఏమీ చేయలేదని.. ఆయన ప్రగల్భాలు ముస్లిములు వద్దనేనని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు

*సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి ఈ చిత్రాన్ని బహిష్కరించిన నాలుగు రాష్ట్రాలపైనా కోర్టు ధిక్కారణ నేరం క్రింద కేసులు నమోదయ్యాయి.

*రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ 'పద్మావత్' సినిమా పాత గాయాలు రేపుతుందని.. ఈ విషయంలో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. 

*అలాగే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, కులమతాలను రెచ్చగొట్టే ఏ చిత్రాన్ని కూడా ప్రదర్శించడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదని తెలిపారు

*భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని చరిత్రలో అంశాలను వక్రీకరించడానికి ఉపయోగించకూడదని.. అందుకే చిత్ర నిర్మాతలు, నిరసనకారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు

*అయితే.. ప్రదర్శించిన చోటల్లా ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలనే వస్తున్నాయి. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x