Pm Kisan Yojana: రైతులకు భారీ బహుమతి.. ఖాతాలోకి నేరుగా రూ.15 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Pm Kisan Fpo Yojana 2022: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతి అందిస్తోంది. రైతులు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయంగా రూ.15 లక్షలు ఇస్తోంది. ఇంకేందుకు ఆలస్యం.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోయి దరఖాస్తు చేసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 06:23 AM IST
  • రైతులను ఆదుకునేందుకు కేంద్ర పెద్దపీట
  • నేరుగా వారి ఖాతాల్లోకి రూ.15 లక్షలు
  • దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి..? ఎలా చేసుకోవాలి..?
Pm Kisan Yojana: రైతులకు భారీ బహుమతి.. ఖాతాలోకి నేరుగా రూ.15 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Pm Kisan Fpo Yojana 2022: రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అన్నదాతల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో తీపికబురు అందించింది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. కిసాన్ యోజన కింద గతంలో రూ.6 వేలు ఇస్తుండగా.. ఇప్పుడు కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం రైతులకు రూ.15 లక్షలు ఇస్తోంది. 

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

- మీరు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి 
- ఇక్కడ ఎఫ్‌పీఓ ఎంపికపై క్లిక్ చేయండి
- ఆ తరువాత 'రిజిస్ట్రేషన్'ఆప్షన్‌కు క్లిక్ చేయండి
- ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అడిన ఇన్ఫరేషన్ ఎంటర్ చేయండి 
- ఇప్పుడు పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చెక్కు, ఐడీ రుజువును స్కాన్ చేసి.. అప్‌లోడ్ చేసి సమర్పించండి.
- మీకు లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ అవుతుంది

లాగిన్ పద్ధతి ఇలా..

- నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌లో FPO ఎంపికపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి. 
- ఇప్పుడు లాగిన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇందులో వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
- ఇప్పుడు మీరు లాగిన్ అవుతారు. 

రైతులకు ఇప్పుడు పెద్ద ప్రయోజనం ఉంటుంది 

- పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన పథకం కింద రైతులకు భారీ ప్రయోజనాలు లభిస్తాయి.
- దీంతో రైతులు సులభంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు.
- ఈ పథకం కింద ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం రూ.15 లక్షలు ఇస్తుంది.
- దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి.
- ఈ డబ్బుతో వ్యవసాయ సంబంధిత పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులను కొనుగోలు చేస్తే సౌలభ్యం ఉంటుంది.

Also Read: MLA Rohit Reddy: నన్ను అరెస్ట్ చేసినా.. బీజేపీకి లొంగను: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  

Also Read: Ind Vs Ban: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఏడాదిగా జట్టుతోనే తిరుగుతున్న యంగ్ క్రికెటర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News