PM Narendra Modi: మరోసారి ప్రధాని మోదీ ప్రసంగం

PM Narendra Modi: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్, అన్‌లాక్ వంటి అంశాలపై మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ భారతీయులకు మరింత స్పష్టత ఇవ్వనున్నారు.

Last Updated : Jun 29, 2020, 11:40 PM IST
PM Narendra Modi: మరోసారి ప్రధాని మోదీ ప్రసంగం

PM Narendra Modi: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్, అన్‌లాక్ వంటి అంశాలపై మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ భారతీయులకు మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలు జూలై 31 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం చేయనుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

Trending News