Bengaluru: అశ్లీల చిత్రాలకు బానిసైన భర్త.. అశ్లీల చిత్రంలో నటించిందని భార్యపై అనుమానం.. పిల్లల ముందే దారుణ హత్య

Bengaluru Man Murdered Wife: అశ్లీల చిత్రాలకు బానిసైన ఓ భర్త.. భార్య అశ్లీల చిత్రంలో నటించిందని అనుమానించి ఆమెను దారుణంగా హత్య చేశాడు. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 04:08 PM IST
  • బెంగళూరులో దారుణ ఘటన
  • భార్య అశ్లీల చిత్రంలో నటించిందనే అనుమానంతో హత్య
  • పిల్లల ముందే భార్యను చంపిన భర్త
Bengaluru: అశ్లీల చిత్రాలకు బానిసైన భర్త.. అశ్లీల చిత్రంలో నటించిందని భార్యపై అనుమానం.. పిల్లల ముందే దారుణ హత్య

Bengaluru Man Murdered Wife: అశ్లీల చిత్రాలు చూసేందుకు బానిసైన ఓ భర్త.. చేయని తప్పుకు భార్యను బలి తీసుకున్నాడు. ఇటీవల ఓ అశ్లీల
చిత్రాన్ని చూసిన అతను... అందులో ఉన్నది తన భార్యే కావొచ్చునని అనుమానించాడు. అప్పటినుంచి ఆమెను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి భార్యను పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే... జహీర్ పాషా (40), తన భార్య ముబీనా (35), ఐదుగురు పిల్లలతో కలిసి రామనగరలో నివాసం ఉంటున్నాడు. పాషా, ముబీనాలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆటో డ్రైవర్ అయిన పాషా పోర్న్ చిత్రాలకు బానిసయ్యాడు. నిత్యం అశ్లీల చిత్రాలు చూడటం అతనికో వ్యసనంలా మారింది. ఇదే క్రమంలో రెండు నెలల క్రితం తన సెల్‌ఫోన్‌లో ఓ అశ్లీల చిత్రం చూశాడు. అయితే అందులో ఉన్న మహిళ తన భార్యేనేమో అన్న అనుమానం కలిగింది.

అప్పటినుంచి నిత్యం ఇంట్లో భార్యతో గొడవపడుతున్నాడు. ఆమెకు ఇతరులతో సంబంధాలు అంటగట్టి చితకబాదుతున్నాడు. ఇదే విషయంపై కొద్దిరోజుల క్రితం కోలార్‌లో జరిగిన బంధువుల వివాహ వేడుకలోనూ ముబీనాపై పాషా దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలోనే ఇతర కుటుంబ సభ్యులకు, బంధువులకు పాషా ఆమెను అశ్లీల చిత్రాల విషయంలో అనుమానిస్తున్న సంగతి తెలిసింది.

20 రోజుల క్రితం పాషా ముబీనాపై మరోసారి దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రిపాలైంది. పాషాపై ముబీనా తండ్రి బ్యాటరాయణపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా... ఆమె అడ్డుపడింది. కేసు పెట్టొద్దని తండ్రిని వారించింది. నాలుగు రోజుల క్రితమే పాషా-ముబీనా జంట రామనగరలోని అద్దె ఇంటికి మారారు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి ముబీనాతో పాషా మరోసారి గొడవపడ్డాడు. పిల్లల ముందే కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. ఇంతలో పాషా పెద్ద కొడుకు సమీపంలోని తాతయ్య ఇంటికి పరిగెత్తుకెళ్లి ఆయన్ను తీసుకొచ్చాడు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ముబీనా చనిపోయినట్లు గుర్తించాడు. హత్య ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ ఎప్పుడు.. ఏ ముహూర్తం.. ఆరోజు ఏం చేయాలి..

Also Read: Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News