పిల్లలపై యాసిడ్ పోసి.. వైద్యం చేస్తున్న జైపూర్ మంత్రగత్తె

నెలలు కూడా నిండని పసికందు ఛాతీపై యాసిడ్ పోసి వైద్యం చేశానని నమ్మబలికింది ఓ మంత్రగత్తె. 

Last Updated : Mar 31, 2018, 05:00 PM IST
పిల్లలపై యాసిడ్ పోసి.. వైద్యం చేస్తున్న జైపూర్ మంత్రగత్తె

నెలలు కూడా నిండని పసికందు ఛాతీపై యాసిడ్ పోసి వైద్యం చేశానని నమ్మబలికింది ఓ మంత్రగత్తె. రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. సవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన బిడ్డకు న్యూమోనియో సోకి బాధపడుతుంటే.. ఎవరో చేతబడి చేశారని నమ్మి స్థానికంగా ప్రేమలతాదేవి అనే మంత్రగత్తె వద్దకు వెళ్లింది.

ఇది దుష్టశక్తుల ప్రభావమే అని చెప్పి ఆమె శిశువు ఛాతీపై యాసిడ్ పోసింది. బాధకు తాళలేక బిడ్డ ఏడుస్తుంటే వెంటనే ఇంటికి తీసుకొచ్చేసింది ఆ మహిళ. విషయం తెలిసిన ఆమె భర్త బిడ్డను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు విషయం తెలుసుకొని.. బిడ్డపై యాసిడ్ పోసిన మహిళపై స్థానిక పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేశారు. పోలీసులు మంత్రతంత్రాల పేరుతో రోగులను మోసం చేస్తున్న మహిళను అరెస్టు చేశారు.

ప్రేమలతాదేవి అనే ఆమె దేవీ ఉపాసకురాలని.. అన్ని రోగాలకు ఆమె మందులిస్తుందని స్థానికంగా కొందరు నమ్ముతున్నారు. ఆ నమ్మకం వల్లే ఆమె వద్దకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెబుతున్నారు

Trending News