Smartphones scheme: రైతులకు గుడ్​ న్యూస్​- స్మార్ట్​ఫోన్ కొంటే రూ.6000 సాయం!

Smartphones scheme: రైతులకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు గుజరాత్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్​ఫోన్ కొనేందుకు గానూ రైతులకు సబ్సిడీ పథకం ప్రారంభించింది. ఇప్పటికే లబ్ధిదారులకు సహాయం అందిస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 09:51 PM IST
  • రైతులకు స్మార్ట్​ఫోన్ సబ్సిడీ పథకం ప్రారంభించిన గుజరాత్​
  • అర్హులకు రూ.6000 వరకు ఆర్థిక సహాయం
  • డిజిటల్ సేవలను చేరువ చేసేందుకు పథకం
Smartphones scheme: రైతులకు గుడ్​ న్యూస్​- స్మార్ట్​ఫోన్ కొంటే రూ.6000 సాయం!

Smartphones scheme: రైతులతు గుజరాత్ ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పింది. స్మార్ట్​ఫోన్ కొనేందుకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ గత వారమే ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించారు. గుజరాత్​ స్మార్ట్​ఫోన్​ సబ్సిడీ యోజన కింద ఈ సహాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాలలు కన్న డిజిటల్ విప్లవంలో భాగంగా.. రైతులు కూడా డిజిటల్​ సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా గత బుధవారం గాంధీనగర్​లోని 33 మంది రైతులకు రూ.1.84 లక్షల సబ్సిడీ అందించినట్లు వివరించింది.

ఇక ఈ పథకం గురించి మీడియాతో మాట్లాడిన.. గుజరాత్​ వ్యవసాయ మంత్రి  రాఘవ్​జీ పటేల్.. ఇప్పటి వరకు ఈ పథకం కింద స్మార్ట్​ఫోన్ సబ్లిడీ కోసం 40,016 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వివరించారు. స్మార్ట్ ఫోన్ విలువలో 40 శాతం (గరిష్ఠంగా రూ.6,000) భరించనున్నట్లు వివరించారు. రూ.15,000 ఫోన్ కొనుగోలు చేస్తే అందులో రూ.6000 ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.

స్మార్ట్​ఫోన్ కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు, పంటకు సంబంధించి వివరాలను తెలియజేయడం వీలవుతుందని చెప్పుకొచ్చారు మంత్రి.

ఈ పథకం గుజరాత్​లో వ్యవసాయ భూమి ఉన్న ఎవరికైనా వర్తిస్తుందని స్పష్టం చేశారు మంత్రి రాఘవ్​జీ పటేల్. అర్హులు https://ikhedut.gujarat.gov.in వెబ్​సైట్లోకి వెళ్లి.. అందులో అడిగిన వివరాలను నింపాలి. దీని ద్వారా ప్రభుత్వం ఆ దరఖాస్తును రివ్యూ చేసి..  అర్హులైన వారికి సబ్సిడీ అందిస్తుందని వివరించారు.

Also read: Narendra Modi: కాశీలో నా చావు కోసం ప్రార్థించారు... సంతోషమే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

Also read: Corona Fourth Wave: జూన్ నుంచి కరోనా ఫోర్త్‌వే‌వ్, ఆగస్టులో పీక్స్, కాన్పూర్ ఐఐటీ తాజా అధ్యయనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News