కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచింది: రజినీకాంత్

కర్ణాటక రాజకీయ పరిణామాలపై దక్షిణ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు.

Last Updated : May 20, 2018, 02:47 PM IST
కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచింది: రజినీకాంత్

కర్ణాటక రాజకీయ పరిణామాలపై దక్షిణ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ మహిళా విభాగం కార్యకర్తలతో రజనీకాంత్ ఆదివారం చెన్నైలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచిందని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. బాల పరీక్షకు బీజేపీ సమయం అడగడం, గవర్నర్ 15 రోజులు గడువు ఇవ్వడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే అన్న ఆయన.. ఒక్కరోజులో బలపరీక్ష పూర్తి చేయాలని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అన్నారు.

 

అటు 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయడంపై ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటానని రజినీ ప్రకటించారు. అయినా అన్నింటికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకా పార్టీని ప్రకటించలేదు కాబట్టి.. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లడలేనని అన్నారు. తాను పెట్టబోయే పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తామని అన్నారు.

 

Trending News