Turmeric Benefits: పసుపుతో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చు! మీరు కూడా తప్పక ట్రై చేయండి..

Turmeric Benefits: పసుపును నీటిలో కలుపుకొని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తాయి.  కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేయండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 08:22 PM IST
Turmeric Benefits: పసుపుతో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చు! మీరు కూడా తప్పక ట్రై చేయండి..

 

Turmeric Benefits: పసుపు ప్రతి ఒక్కరి వంట గదిలో లభిస్తుంది. ప్రతి ఒక్క భారతీయుడు ఆహార పదార్థాల్లో తప్పకుండా పసుపును వినియోగిస్తారు. ప్రతిరోజు ఆహారాలలో పసుపును వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో అధిక పరిమాణంలో ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తగిన మోతాదులో వినియోగించడం వల్ల కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు బాడీపెయిన్స్ వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరంలోని వ్యర్ధపదార్థాలన్నిటిని బయటకు పంపించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. 

అంతేకాకుండా పసుపును ప్రతిరోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి లభిస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు పసుపుతో తయారుచేసిన దీని తాగడం వల్ల శరీరంలోని పేరుకుపోయిన బ్యాక్టీరియా సులభంగా బయటికి వస్తుంది. అంతేకాకుండా తీవ్ర వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గుండెను ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!

శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా తీవ్ర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా పసుపును వినియోగించాల్సిన ఉంటుంది. ఇందులో లభించే ఔషధ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా గుండె దమనంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాలను నియంత్రించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు భావిస్తున్నారు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు పసుపు నీటిని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.

తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ఎన్నో రకాల పొట్ట సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి పసుపు ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి పసుపును నీటిలో కలుపుకొని తాగడం వల్ల పొట్ట సమస్యలే కాకుండా డిహైడ్రేషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పసుపును నీటిలో కలిపి మరిగించి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News