పొరపాటున మరో రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండియన్ ఫ్లైట్

మాల్దీవుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా విమానం

Last Updated : Sep 7, 2018, 09:42 PM IST
పొరపాటున మరో రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండియన్ ఫ్లైట్

మాల్దీవుల్లో పొరపాటున ప్రస్తుతం వినియోగంలో లేని మరో రన్ వే పై దిగిన ఎయిర్ ఇండియా విమానం అక్కడే ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం AI263 విమానం మాలె వెలెనా అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే, అనంతరం ప్రముఖ న్యూ్స్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉండి ఇంకా వినియోగంలోకి రానటువంటి మరో రన్ వేపై ఎయిర్ ఇండియాకు చెందిన 320-ఎన్ఈఓ వీటీ ఎక్స్ఎల్ అనే విమానం దిగినట్టు తెలుస్తోంది. ఈ విమానంలో ఉన్న 136 మంది ప్రయాణికులు సహా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.

 

 

విమానం రెండు టైర్లు పంక్చర్ కావడంతో విమానాన్ని విమానాశ్రయంలో ఉన్న వాహనాల సహాయంతో పార్కింగ్ బేకి తరలించారు.

 

Trending News