కేసీఆర్‌ని విరాట్ కోహ్లీతో పోల్చిన ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ !

కేసీఆర్ మరో విరాట్ కోహ్లీ.. తెలంగాణ ఎన్నికల్లో సంచరీ కొడతారు : కేటీఆర్

Last Updated : Nov 30, 2018, 06:05 PM IST
కేసీఆర్‌ని విరాట్ కోహ్లీతో పోల్చిన ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ !

హైదరాబాద్: హైదరాబాద్‌లో మిని భారత్ ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం శేరిలింగంపల్లిలోనే ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి జనం వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ స్థిర నివాసం పొందారు. 2018 ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో రాహుల్ గాంధీ గారు చంద్రబాబు కానుకగా ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చుంటే, ఇక చంద్రబాబు గారేమో రాహుల్ గాంధీ ఇచ్చిన ఫిడేల్ వాయించుకుంటూ కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. గురువారం రాత్రి శేరిలింగంపల్లిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే పార్టీకి విజయాన్ని కట్టబెడతాయని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. 

ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధితో కేటీఆర్ మాట్లాడుతూ.. తమ ప్రియతమ నాయకుడు, కేసీఆర్ టీమిండియా క్రికెట్ కెప్టేన్ విరాట్ కోహ్లీ లాంటివారని.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 100కుపైగా స్థానాలు గెల్చుకుని సెంచరీ కొడతారని అన్నారు.

Trending News