Nalgonda Rape Case: కలియుగం అంటే ఇదేనేమో..?.. కొడుకు యువతిని హత్యాచారం చేస్తుండగా.. కాపలాగా తల్లి.. స్టోరీ ఏంటంటే..?

Teen girl rape and murder: కళ్ల ముందే మరో యువతిని హత్య చారం చేస్తుంటే.. ఆ తల్లి కాపలాగా ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 న జరిగిన ఘటన సంచలనంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 26, 2024, 05:02 PM IST
  • నల్గొండలో దారుణం..
  • విస్మయం వ్యక్తం చేస్తున్నస్థానికులు..
Nalgonda Rape Case: కలియుగం అంటే ఇదేనేమో..?..  కొడుకు  యువతిని హత్యాచారం చేస్తుండగా.. కాపలాగా తల్లి.. స్టోరీ ఏంటంటే..?

3 Arrested for rape and murder teen girl in Nalgonda: ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు చేసిన కూడా ఆడవాళ్ల మీద మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చిన కూడా కొంతమంది కామాంధులలో మార్పులు రావడం లేదు. ఆడది కన్పిస్తే చాలు.. కామంతో చేయకూడని పనులన్నిచేసేస్తున్నారు. ప్రతిరోజు మహిళలపై అత్యాచార ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.

మహిళలకు మాత్రం ఎక్కడ భద్రతలేదని చెప్పుకొవచ్చు. గుడి, బడి, బస్టాండ్,రైల్వేస్టేషన్ లలో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. చివరకు ఇంట్లో వాళ్లు సైతం కొన్ని చోట్ల..అన్నలు, తండ్రులు సైతం కాటేసిన ఘటనటు వార్తలలో నిలిచాయి. అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరకు వెళ్లే అక్కడ కూడా ఇదే విధంగా ..వేధింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నల్గొండలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు..

 నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని బావబామ్మర్దుల అత్యాచారంచేసి హత్య చేశారు. అక్కడ అనుమానం రాకుండా.. నిందితుడు కన్న తల్లి అక్కడ కాపాలాగా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుట్టలగడ్డతండాకు చెందిన రూపావత్‌ నాగు నాయక్‌(22)కు.. మరో యువతికి పరిచయం ఏర్పడింది. సదరు యువతి హైదరబాద్ లో కాలేజీకి వెళ్తుంటుంది. దీంతో యువతికి మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రెగ్నెంట్ చేశాడు.

ఆ తర్వాత పెళ్లి అనగానే ముఖం చాటేశాడు. యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కింద కేసు నమోదు చేశారు. కొంత కాలం దూరం ఉన్న సందరు నిందితుడు.. నాగు.. మరల యువతికి ఫోన్ లు చేసి మేజర్ కాగానే పెళ్లి చేసుకుంటానని మరల ఆమెకు మాయమాటలు చెప్పి, ప్రెగ్నెంట్ చేశాడు. అప్పుడు కూడా.. పెళ్లి అనగానే.. మరోసారి హ్యాండిచ్చాడు. దీంతో గర్భాస్రావం చేయించాడు. దీంతో యువతి..

ఈ నెల 14న పుట్టలగడ్డతండాలోని నాగు ఇంటికి వెళ్లింది. అప్పుడు.. యువకుడి తల్లి.. తన కొడుకును జైలుకు పంపిందని కోపంపెంచుకుంది. అప్పటికే ప్లాన్ లో ఉన్న వాళ్లు.. యువతికి యాయమాటలు చెప్పి పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ నాగు.. తన బావ క్రాంతికుమార్ ను రప్పించి యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఇదంతా జరుగుతున్న ఆ నిందితుడి తల్లి వాళ్లకు కాపాలాగా అక్కడే ఉంది.  

Read more: Viral Video: ఛీ..ఛీ ఎంత ఘోరం.. పట్టపగలే బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. వీడియో వైరల్..

యువతి తల్లిదండ్రులు పోలీసులకుఫిర్యాదు చేయడంతో.. వారు వెతుకడం ప్రారంభించారు. చివరకు.. యువతి పోలాల్లో సూసైడ్ చేసుకున్నట్లు కన్పించింది. వెంటనే ఆమెను పోస్టు మార్టం కు తరలిచారు. ఆమెపై అత్యాచారం, హత్య చేసినట్లు తెలిసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కుమారుడు ఓ ఆడ పిల్లను రేప్ చేసి హతమార్చుతుంటే తల్లి కాపలాగా ఉండటం విస్మయానికి గురి చేసిందని తెలుస్తోంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News