స్వచ్ఛభారత్ సందేశమిచ్చిన బాహుబలి..!

Last Updated : Sep 29, 2017, 06:24 PM IST
స్వచ్ఛభారత్ సందేశమిచ్చిన బాహుబలి..!

బాహుబలి సినిమాతో ప్రేక్షకుల మన్ననలను పొంది... జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్. తాజాగా ఆయన తన ఫేస్‌బుక్‌లో స్వచ్ఛభారత్ ఔన్నత్యాన్ని తెలుపుతూ ఓ పోస్టు ప్రచురించారు. ‘ప్రియమైన అభిమానులకు.. పరిశుభ్రతకు ఎంతో విలువిచ్చిన జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో నేనూ నా వంతు బాధ్యతగా పాల్గొనాలని  అనుకుంటున్నాను. నా దేశాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం ఓ పౌరుడిగా నా బాధ్యతే  మాత్రమే కాదు.. అలవాటుగా కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నాలాగే మీరందరూ ఆలోచించి మన దేశం శుభ్రంగా ఉండేలా మీ వంతు కృషిచేయాలని ఆశిస్తున్నాను. అప్పుడే మన దేశం ఇప్పటికంటే మరింత సౌందర్యంగా తయారవుతుంది. జై హింద్‌!’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సాహో సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

;;

Trending News