karnataka: బస్సులో మంటలు.. ఐదుగురు సజీవ దహనం

 కర్ణాటక (karnataka) లో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా హిరియూర్ దగ్గర నాలుగో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Last Updated : Aug 12, 2020, 11:08 AM IST
karnataka: బస్సులో మంటలు.. ఐదుగురు సజీవ దహనం

bus fire Accident: బెంగళూరు: కర్ణాటక ( karnataka ) లో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా హిరియూర్ దగ్గర నాలుగో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రహాదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా.. 27 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. అయితే ఈ ప్రైవేటు బస్సు బెంగళూరు ( bengaluru ) నుంచి విజయపురానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  Also read: Bengaluru Riots: సోషల్ మీడియా పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. ఇద్దరు మృతి

ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం మేరకు వెంటనే పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం బుధవారం తెల్లవారు జామున సుమారు 3.30గంటలకు జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. Also read: India: 46 వేలు దాటిన కరోనా మరణాలు

Trending News