Satish Vegesna: శతమానం భవతి దర్శకుడి కొత్త సినిమా

శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న. శతమానం భవతి తర్వాత శ్రీనివాస కల్యాణం సినిమా చేసి మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా సినిమా చేశాడు. ఇక ఇప్పుడు ఇద్దరు యువ నటులతో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Last Updated : Aug 15, 2020, 06:56 PM IST
Satish Vegesna: శతమానం భవతి దర్శకుడి కొత్త సినిమా

శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న. శతమానం భవతి తర్వాత శ్రీనివాస కల్యాణం సినిమా చేసి మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా సినిమా చేశాడు. ఇక ఇప్పుడు ఇద్దరు యువ నటులతో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ యువ నటులు ఎవరో కాదు.. అనారోగ్యంతో చనిపోయిన రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరికి ( Actor Srihari ) తనయుడు అయిన మేఘాంశ్ శ్రీహ‌రి ( Meghamsh Srihari ) ఒకరైతే.. సతీశ్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న మరొకరు. గతేడాది రాజ్ దూత్ సినిమా చేసిన మేఘాంశ్... ఈసారి సతీశ్ వేగేష్న సినిమాలో అవకాశం అందిపుచ్చుకున్నాడు. Also read : Patriotic songs: దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 బాలీవుడ్ పేట్రియాటిక్ సాంగ్స్

ఇక స‌తీశ్ వేగేశ్న త‌న‌యుడు స‌మీర్ వేగేశ్న ( Sameer Vegesna ) ఈ సినిమాతో నటుడిగా తెరకు పరిచయం అవుతున్నాడు. మేఘాంశ్, సమీర్ వేగేశ్న ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎల్‌.వి. స‌త్య‌నారాయ‌ణ‌ (స‌త్తిబాబు) నిర్మిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ '' తాను ఎక్కువగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించానని.. కానీ తొలిసారి పూర్తిస్థాయి యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను డైరెక్ట్ చేస్తున్నాను'' అని అన్నారు. Also read : Sundeep Kishan: సందీప్ కిషన్‌ పెళ్లి ఫిక్స్ అయిందా ? అమ్మాయి ఎవరు ?

ఇప్పటికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌ి చేసుకున్న ఈ సినిమా.. క‌రోనావైర‌స్ ( Coronavirus ) నుంచి ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన తర్వాత సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. Also read : Mohan Babu: ‘సన్నాఫ్ ఇండియా’గా కలెక్షన్ కింగ్

Trending News