కేసీఆర్ కు ఎంఎస్ స్వామినాథన్ లేఖ

రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్ లేఖ రాశారు.

Last Updated : Jan 6, 2018, 09:09 PM IST
కేసీఆర్ కు ఎంఎస్ స్వామినాథన్ లేఖ

రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్ లేఖ రాశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని లేఖలో పేర్కొన్నారు. సాగునీటి భద్రత కల్పిస్తున్న మీకు ధన్యవాదాలు. రైతుల తరుఫున కృతజ్ఞతలు అని చెప్పారు.

నీటి ఎద్దయి ఎక్కువగా ఉండి, ఎక్కువగా బోరుబావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణ రైతాంగానికి 24 గంటల విద్యుత్ ఒక వరం లాంటిదని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. పంట నష్టం లేకుండా సాగునీరు అందుబాటులో ఉంచడం వల్ల వ్యవసాయ రంగం వృద్ధి చెందుతుందని చెప్పారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, అలాగే తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Trending News