చలో చలో చలోరే: పవన్‌తో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డ జనాలు

Last Updated : Jan 24, 2018, 04:28 PM IST
చలో చలో చలోరే: పవన్‌తో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డ జనాలు

పవన్ కల్యాణ్ మూడో రోజు 'చలో చలో చలోరే' ప్రజాయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం తన అభిమానులతో కలిసి ఆయన కొత్తగూడెం నుంచి ఖమ్మం ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలోని దంతాలపల్లిలో కాసేపు సేదదీరారు. పవన్ ఆగిన విషయాన్ని పసిగట్టిన స్థానికులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. కాగా పవన్ వారితో పవన్ కాసేపు మాట్లాడి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ స్థానిక యువకుడు పవన్ తో మాట్లాడుతూ..అన్న తెలంగాణలో మీకు భారీగా అభిమానులు ఉన్నారని చెప్పడంతో చిరునవ్వు నవ్వారు. అనంతరం పవన్ కల్యాణ్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. కాగా శాంతిభద్రతల దృష్యా పవన్ కాన్వాయ్ వెంట ర్యాలీగా బయల్దేరిన వందలాది బైకులను మార్గం మధ్యలో పోలీసులు విడతల వారీగా వేరు చేశారు.

Trending News