AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ

AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా సంక్రమణ స్వల్పంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య ఇలా ఉంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2021, 08:29 PM IST
AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ

AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా సంక్రమణ స్వల్పంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 55 వేల 251 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Test)నిర్వహించగా 1171 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1207 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో వివిధ ఆసుపత్రుల్లో 13 వేల 749 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 లక్షల 40 వేల 349 మంది కరోనా వైరస్(Coronavirus) బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14 వేల 108 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. గత 24 గంటల్లో 1207 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20 లక్షల 12 వేల 492 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 255, చిత్తూరులో 158, నెల్లూరులో 145, కృష్ణా జిల్లాలో 147, గుంటూరులో 101 కేసులు నమోదయ్యాయి.

Also read: Ys Jagan Review: రాష్ట్రంలో తగ్గిన మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News