Pfizer antiviral pill: కరోనాతో మరణం ముప్పును 89 శాతం తగ్గిస్తున్న ఫైజర్ ఔషధం!

Pfizer COVID pill: కరోనా సోకిన వారిలో మరణం ముప్పును తగ్గించే విధంగా.. ఫైజర్ మరో ఔషధాన్ని అభివృద్ధి చేసింది. మాత్రల రూపంలో తీసుకునేలా అభివృద్ధి చెసిన ఈ ఔషధానికి సంబంధించిన పరీక్ష ఫలితాలను తాజాగా వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 11:05 AM IST
  • కరోనా చికిత్సకు ఫైజర్ కొత్త ఔషధం
  • మరణావకాశాలను భారీగా తగ్గిస్తున్నట్లు వెల్లడి
  • త్వరలోనే నియంత్రణ సంస్థల దృష్టికి పరీక్ష ఫలితాల వివరాలు
Pfizer antiviral pill: కరోనాతో మరణం ముప్పును 89 శాతం తగ్గిస్తున్న ఫైజర్ ఔషధం!

Pfizer antiviral pill: దాదాపు రెండేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ ఫార్మా కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన టీకాను (Corona Vaccine) అభివృద్ధి చేశాయి. ఇంకా కొన్ని వ్యాక్సిన్​లు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయినప్పటికీ కరోనా సోకిన వారిలో కొంత మంది తీవ్ర అనారోగ్యంపాలై మృత్యువాత (Corona Deaths) పడుతున్నారు.

అయితే కరోనా సోకిన వారిలో మరణాల శాతాన్ని తగ్గించే విధంగా అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ ఫైజర్ ఓ ఔషధాన్ని (Pfizer Corona Drug) అభివృద్ధి చేసింది.

మాత్రల రూపంలో తీసుకులనేలా అభివృద్ధి చేసిన ఈ ఔషధంపై (Pfizer Antiviral pill) ఇటీవల పరీక్షలు నిర్వహించగా.. అద్భుతమైన ఫలితాలను సాధించినట్లు ఫైజర్ వెల్లడించింది.

Also read: Australia Covaxin Approval: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక గుర్తింపు

Also read: COVID-19: ఆ దేశాల్లో కోవిడ్‌ కొత్త స్ట్రెయిన్‌ కల్లోలం, మనదేశంలో కాస్త తక్కువే

పరీక్ష ఫలితాలు ఇలా..

1200 మందికిపైగా చేసిన పరీక్షల ఆధారంగా.. ఈ ఫలితాలను వెల్లడించింది ఫైజర్. పరీక్షల్లో పాల్గొన్న వారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలున్న బాధితులు, వృద్దులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. 

'కరోనా లక్షణాలను గుర్తించిన వారంలోపే ఈ ఔషధాన్ని ఇవ్వడం ప్రారంబించారు. ఈ ఔషధం తీసుకున్న వారిలో 0.8 శాతం మంతి మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు నెల రోజుల్లో ఎవరూ మరణించలేదు. అయితే ప్లాసిబో (ఔషధం లేని మాత్ర) తీసుకున్న వారిలో 7 శాతం మంది ఆస్పత్రిలో చేరగా.. అందులో ఏడుగురు మరణించారు. దీనితో ఈ మాత్రల వల్ల మరణాలు తగ్గే అవకాశం 89 శాతంగా లెక్కించారు పరిశోధకులు.' అని ఫైజర్ పేర్కొంది.

త్వరలోనే ఔషధ నియంత్రణ సంస్థలకూ ఈ ఫలితాల వివరాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. పాక్స్‌లోవిడ్‌ (Pfizer Paxlovid) బ్రాండ్‌ పేరుతో ఈ యాంటీవైరల్‌ ఔషధాన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.

Also read: UK COVID prevalence 1 in 50: బ్రిటన్‌లో ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా

Aslo read: Vaccine For Kids: చిన్నారుల కరోనా టీకాకు అమెరికా ఎఫ్​డీఏ ఆమోదం- 5-11 ఏళ్ల వారికి ఇచ్చేందుకు కసరత్తు!

ఇది కాంబినేషన్ ఔషధం..

కొత్తగా అభివృద్ధి  చేసిన మాత్ర కాంబినేషన్ ఔషధం అని ఫైజర్ వెల్లడించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైటోనవిర్‌తో కలిపి దీనిని తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మూడు మాత్రల్లో లభించే ఈ ఔషధాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. 20 శాతం బాధితుల్లో మాత్రమే దుష్ప్రభావాలు కనిపించినట్లు చెప్పింది.

కరోనా చికిత్స కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సూది మందును ఎక్కువగా వినియోగిస్తున్నారు. బ్రిటన్​లో మోల్నుపిరవిర్ పేరుతో మెర్క్ (Merc Corona Pill)​ తీసుకొచ్చిన మాత్రకు బ్రిటన్ ఇటీవలే ఆమోదం తెలిపింది.

Also read: Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది

Also read: China Lockdown: 'నిత్యవసరాలు స్టాక్ పెట్టుకోండి' - ప్రజలకు చైనా ప్రభుత్వం హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News