చిత్తూరు జిల్లా పెనుమూరులో నరబలి..?

చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో దారుణం జరిగింది.

Last Updated : Mar 5, 2018, 05:47 PM IST
చిత్తూరు జిల్లా పెనుమూరులో నరబలి..?

చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో దారుణం జరిగింది. పెనుమూరులో పసికందును నరబలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జలశయం దగ్గర 8 నెలల పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం తల లేకుండా మొండెంతో కనిపించడం కలకలం రేపింది. దీంతో స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన చోట క్షుద్రపూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపించడంతో ఎవరో నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

పసికందు మృతదేహం నీళ్లలో పూర్తిగా కుళ్లిపోయింది. పసికందు తల జాడ ఇంకా తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ పసికందు ఎవరు? మృతదేహం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తల కోసం గాలింపు కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Trending News