ముంబాయిపై 14 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

మంగళవారం బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో ముంబాయిని ఓడించింది.

Last Updated : May 2, 2018, 05:59 PM IST
ముంబాయిపై 14 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

బెంగళూరు: ముంబై ఇండియన్స్‌‌కు మరో ఓటమి ఎదురైంది. మంగళవారం బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో ముంబాయిని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 168 పరుగుల విజయలక్ష్యంతో బరిలోనికి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దీంతో ముంబాయిపై బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కెప్టెన్ విరాట్ కొహ్లి రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు, మెక్‌క‌ల్లమ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 37 పరుగులు సాధించాడు. ఓపెనర్ మన్నన్ వోహ్రా 4 సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 31 బంతుల్లోనే 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో గ్రాండోమ్ మూడు సిక్స్‌లతో అజేయంగా 23 పరుగులు చేశాడు. డీ కాక్ 7,  మందీప్ 14, వాషింగ్టన్ 1, సౌథీ 1, ఉమేష్ యాద‌వ్ 1 ప‌రుగుతో రాణించ‌డంతో బెంగ‌ళూరు 167 ప‌రుగులు చేయ‌గ‌లిగింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్య ఐదు ఫోర్లు, సిక్స్‌తో 50 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో ముంబయికి ఓటమి తప్పలేదు.

Trending News