Inspired By Shradda Walker Case: శ్రద్దా వాకర్ కేసు చూసి పిన్నిని పది ముక్కలు చేసిన వ్యక్తి.. దారుణాతి దారుణంగా!

Nephew kills aunt and Chopped her Body : శ్రద్దా వాకర్ కేసును చూసి ప్రేరణ పొందిన ఒక వ్యక్తి తన పిన్నిని చంపి ఆమెను కూడా 10 ముక్కలు చేసి పారేసిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 18, 2022, 03:50 PM IST
Inspired By Shradda Walker Case: శ్రద్దా వాకర్ కేసు చూసి పిన్నిని పది ముక్కలు చేసిన వ్యక్తి.. దారుణాతి దారుణంగా!

Nephew kills aunt and Chopped her Body into 10 Pieces: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ను 36 ముక్కలుగా నరికిన ఉదంతం తర్వాత అలాంటి కేసులు అనేకం తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో సొంత బంధువును 10కి పైగా ముక్కలు చేసిన సంచలన కేసు తెరపైకి వచ్చింది. హత్య చేసిన వ్యక్తి వయసు దాదాపు 22 నుంచి 24 ఏళ్లు ఉంటుందని అంటున్నారు.

అతను తన జీవితంలో నాన్ వెజ్ కూడా ముట్టుకోలేదు, కానీ తన బంధువయిన మహిళను చంపి ఆమె మృతదేహాన్ని తీరికగా 10కి పైగా ముక్కలు చేశాడు. వాటిని బ్రీఫ్‌కేస్‌లో ప్యాక్ చేసి, 3 రోజులు దాచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా మూడు రోజులు దాచి తర్వాత హరిద్వార్‌కు పారిపోయారు. ఇప్పుడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన మొత్తం జైపూర్‌లోని విద్యాధర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

జైపూర్ ఉత్తర DCP పారిస్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, అనూజ్ శర్మ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఇంజనీర్ అని చాలా మతపరమైన వ్యక్తి. విద్యాధర్ నగర్‌లోని ఓ ఫ్లాట్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడని పేర్కొన్నారు. కానీ డిసెంబర్ 11న తన పిన్నిని దారుణంగా హత్య చేశాడు. అనూజ్ ముందుగా మార్కెట్ నుంచి ఒక కొత్త మార్బుల్ కట్టర్ తెచ్చాడు. అలాగే బ్రీఫ్‌కేస్‌ను కూడా కొన్నాడు. తరువాత ఆమెను కొట్టిచంపినట్టు పోలీసులు గుర్తించారు.

ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరుకాకుండా పిన్ని అనూజ్ ను అడ్డుకుంది. ఈ క్రమంలో వంట గదిలో ఆహారం వండుతుండగా ఆమె తలపై సుత్తితో పలుమార్లు కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత మృత దేహాన్ని ఈడ్చుకెళ్లి బాత్‌రూమ్‌లోకి తీసుకొచ్చి మార్బుల్‌ కట్టర్ తో రెండు చేతులు, రెండు కాళ్లు, మొండెం నాలుగు ముక్కలు వేరు చేసిన తర్వాత పెద్ద సౌండ్ తో ఇంట్లో కీర్తనలు ప్లే చేసి, ఆమె శరీరాన్ని మొత్తం 10 ముక్కలు చేసినట్టు తేల్చారు.

అన్నింటినీ వేర్వేరు ప్యాకెట్లలో బ్రీఫ్‌కేస్‌లో నింపి, ఢిల్లీ వెళ్లే రోడ్డులో దాచడానికి ప్రయత్నించాడు. అందుకే ఆ  రెండు మూడు రోజుల పాటు బ్రీఫ్‌కేస్‌ని నిరంతరం మోసుకెళ్ళాడు, కానీ అతనికి వాటిని పారేసే అవకాశం రాలేదు.చివరికి, 3 రోజుల తర్వాత అతను మృతదేహానికి సంబంధించిన అన్ని ముక్కలు పడేశాడు. ఇక సరోజ్ శర్మ చిన్న కుమార్తె పూజా శర్మ తన తల్లి కనిపించడం లేదని కేసు నమోదు చేసింది.

తన తల్లి మేనమామ ఇంట్లో ఉంటోందని ఆమె కనిపించకుండా పోయినప్పుడు ఇంట్లో అనూజ్, సరోజ్ దేవి మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇక హరే కృష్ణ మూమెంట్ లో యాక్టివ్ గా ఉండే అనూజ్ ను హరిద్వార్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక శ్రద్ధా హత్య కేసు చూసిన తర్వాత తన పిన్ని మృతదేహం ముక్కలను పారవేయాలనే ఆలోచన తన మనసులో వచ్చిందని నిందితుడు విచారణలో బయటపడ్డడు. ఇక ఘటనలో ఉపయోగించిన సుత్తి, కట్టర్ మిషన్, బకెట్, సూట్‌కేస్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: Jharkhand Murder Case: పెళ్లైన పది రోజులకే దారుణం.. శ్రద్ధా హత్య తరహాలోనే జార్ఖండ్‌లో ఘోరం

Also Read: Saphala Ekadashi 2022:  సఫల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. జీవితాంతం లాభాలే..లాభాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News