Telangana CMRF: సినీ ప్రముఖుల మానవత్వం.. విరాళం ఇచ్చిన చిరు, చెర్రీ, తేజ్‌ సహా ఇతరులు

Cine Actors Donated Cheques To Telangana CMRF Including Chiranjeevi Sai Dharam Tej And Others: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సినీనటులు చిరంజీవి, రామ్‌చరణ్‌, అలీ, విశ్వక్‌ సేన్‌తోపాటు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు.

1 /9

Telangana CMRF: ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, విశ్వక్ సేన్, సాయి ధరమ్ తేజ్ తదితర సినీ, వ్యాపార ప్రముఖులు విరాళం అందించారు.

2 /9

Telangana CMRF: ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం అందించిన మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చిరును రేవంత్‌ రెడ్డి సత్కరించారు.

3 /9

Telangana CMRF: తన తనయుడు, సినీ నటుడు రామ్ చరణ్ ప్రకటించిన రూ.50 లక్షలకు సంబంధించిన చెక్కును చిరంజీవి అందించారు.

4 /9

Telangana CMRF: సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన సినీ నటుడు మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్

5 /9

Telangana CMRF: సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షల విరాళం అందించారు.

6 /9

Telangana CMRF: అమర్‌రాజా గ్రూప్‌ తరఫున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రూ.కోటి విరాళం చెక్కును అందజేశారు.

7 /9

Telangana CMRF: ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 లక్షలు విరాళంగా అందించిన సినీ నటుడు అలీ

8 /9

Telangana CMRF: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి రూ.25 లక్షల విరాళం అందించారు.

9 /9

Telangana CMRF: గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి రూ.25 లక్షల విరాళం ఇచ్చారు.