Telugu Heroes Donatations: వరద బాధితులకు అండగా టాలీవుడ్ హీరోలు.. ఎవరు ఎంత విరాళం ఇచ్చారంటే..

Telugu Heroes Donatations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ టాలీవుడ్  హీరోలు ముందుంటారు. వరదలతో గత కొన్ని రోజులుగా  తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత విరాళం ఇచ్చారంటే..

1 /11

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడానికి మన హీరోలు ముందుకొచ్చారు. అంతేకాదు తమ వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు తమకు తోచినంత భారీ విరాళం ప్రకటించారు.

2 /11

రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి విరాళం ప్రకటించారు.

3 /11

నందమూరి బాలకృష్ణ.. నందమూరి బాలకృష్ణ ఏపీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి విరాళం అనౌన్స్ చేశారు.

4 /11

చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి విరాళం ప్రకటించారు.

5 /11

పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కు రూ. కోటి.. తెలంగాణ రూ. కోటి.. అంతేకాదు ఏపీలో 400 పంచాయితీలకు లక్ష చొప్పున రూ. 4 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్. మొత్తంగా  చొప్పున రూ. 6 కోట్ల విరాళం..

6 /11

జూనియర్ ఎన్టీఆర్.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి విరాళం..

7 /11

మహేష్ బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. కోటి విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున సీఎం సహాయనిధికి చెక్ అందజేసారు.

8 /11

అక్కినేని నాగార్జున (అక్కినేని కుటుంబం).. అక్కినేని నాగార్జున .. అక్కినేని కుటుంబం తరుపున రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి విరాళం ప్రకటించారు.

9 /11

అల్లు అర్జున్.. అల్లు అర్జున్ కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహాయ నిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి విరాళం ప్రకటించిన ఐకాన్ స్టార్.  

10 /11

ప్రభాస్.. రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో రూ. కోటి చొప్పున రెండు కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

11 /11

సిద్దు జొన్నలగడ్డ చెరో రూ. 15 లక్షల చొప్పున రూ. 30 లక్షలు..విశ్వక్ సేన్.. చెరో రూ. 5 లక్షలు చొప్పున రూ. 10 లక్షల విరాళం.. త్రివిక్రమ్ మరియు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ తో కలిసి చెరో రూ. 25 లక్షల చొప్పున రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. అటు వైజయంతి మూవీస్ అధినేత తెలంగాణకు రూ. 20 లక్షలు.. ఏపీకి రూ. 25 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 45 లక్షల విరాళం.. అటు సినీ నటుడు అలీ కూడా చెరో రూ. 3 లక్షల చొప్పున .. రూ. 6 లక్షల విరాళం ప్రకటించారు.