వైరల్ అవుతున్న 'జియో పానీపూరీ'

జియో నెట్‌వర్క్ తరహాలో కర్ణాటకలోని ఓ కుర్రాడు ఆఫర్లను ప్రకటిస్తూ పానీపూరీ విక్రయిస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Last Updated : Apr 29, 2018, 08:32 AM IST
వైరల్ అవుతున్న 'జియో పానీపూరీ'

కర్ణాటక: జియో నెట్‌వర్క్ తరహాలో కర్ణాటకలోని ఓ కుర్రాడు ఆఫర్లను ప్రకటిస్తూ పానీపూరీ విక్రయిస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రూ.80 చెల్లిస్తే గంటపాటు అన్‌లిమిటెడ్‌గా పానీపూరీ తినొచ్చని.. రూ.200 చెల్లిస్తే ఒకరోజు మొత్తం పానీపూరీ తినవచ్చని ఫ్లెక్సీ కట్టి మరీ అమ్మకాలు చేపట్టాడు. అంతేకాకుండా రూ.2000 చెల్లిస్తే నెల మొత్తం పానీపూరీ అన్‌లిమిటెడ్‌గా తినవచ్చని ఆఫర్ ప్రకటించాడు. ఆఫర్ బాగున్నట్లుంది..డియర్ పానీపూరీ లవర్స్ ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్ వేయకూడదూ..!

ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్లు చేశారు. 'బాబు బిజినెస్ చేసుకోవాలని లేదా.. ఈ విషయం గర్ల్స్‌కి తెలిస్తే నీ బిజినెస్ లాస్. వెంటనే ఆఫర్ మార్చెయ్..'అంటూ ఓ నెటిజన్, 'అడ్రస్ చెబితే అమ్మాయిలందరూ అక్కడ 'క్యూ' లో నిల్చుంటారని మరొకరు..  'హట్ స్పాట్ అంటే ఇదే.. నేనూ నా ఫ్రెండ్స్ మంత్లీ పాస్ తీసుకుంటాము' అని నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే వైరల్ అవుతున్న ఈ 'జియో పానీపూరీ' ఎక్కడ అమ్ముతున్నారో పేర్కొనలేదు కానీ మైసూరులోని రామస్వామి సర్కిల్‌లో ఉందని ఒకరు కామెంట్ బాక్స్‌లో పేర్కొన్నారు.

Trending News