Men Wore Skirts: అమ్మాయిల్లా స్కర్ట్ ధరించి మెట్రో ఎక్కారు.. తరువాత ఏమైందో మీరే చూడండి

Men Wore Skirts: ఇద్దరు యువకులు అచ్చం అమ్మాయిల్లా స్కర్ట్స్ ధరించి పబ్లిక్‌లోకి వచ్చేశారు. అది కూడా ఢిల్లీ మెట్రో రైలు ఎక్కారు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో, ఢిల్లీ మెట్రో రైల్లో ఆ ఇద్దరిని చూసిన జనం రియాక్షన్ ఎలా ఉందో చెప్పడం కాదు కానీ మీరే చూసేయండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2023, 07:05 PM IST
Men Wore Skirts: అమ్మాయిల్లా స్కర్ట్ ధరించి మెట్రో ఎక్కారు.. తరువాత ఏమైందో మీరే చూడండి

Men Wore Skirts: ఆజ్ కల్ కా జమానా పూరా బదల్ గయా.. అవును.. నేమ్ కోసం ఫేమ్ కోసం జనం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు పేరు తెచ్చుకోవాలన్నా.. నలుగురి కంట్లో పడేలా ఫేమస్ అవ్వాలన్నా అందుకోసం ఎంతో శ్రమించాల్సి వచ్చేది .. ఎంతో కష్టపడాల్సి వచ్చేది .. కానీ ఇప్పుడు అలా కాదు . ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. ఏం చేయాలన్నా గతంలో మాదిరిగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఏదో ఒక ఐడియాను కాస్తంత క్రియేటివ్‌గా ఆలోచించి నలుగురికి భిన్నంగా ఒక వీడియో షూట్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేస్తే సరి. 

సోషల్ మీడియాలో వీడియోస్ కి భారీ ప్రజాధరణ ఉంది. చాలామంది తమ దైనందిన జీవితంలో తమ తమ పనులు చేసుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూసి తెలుసుకుంటున్నారు. ఈ కారణంగానే సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ నలుగురితో కనెక్ట్ అయ్యేలా ఉండే కథనాలు కానీ లేదా జోక్స్ కానీ లేదా వైరల్ అయ్యేలా షూట్ చేసిన ప్రాంక్ వీడియోలకు కానీ భారీగా జనాధరణ ఉంది. 

సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసే వారిలో కొంతమంది ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏదైనా నలుగురికి ఉపయోగపడే కంటెంట్ ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తుండగా.. ఇంకొంత మంది ఎలాంటి పర్పస్ లేకుండానే కేవలం వైరల్ అయితే చాలు అన్నట్టుగా ఏదో ఒక విభిన్నమైన కోణంలో వీడియోలు తీసి పెట్టేస్తుంటారు. ఇదిగో ఇక్కడ ఇప్పడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఇద్దరు యువకులు అచ్చం అమ్మాయిల్లా స్కర్ట్స్ ధరించి పబ్లిక్ లోకి వచ్చేశారు. అది కూడా ఢిల్లీ మెట్రో రైలు ఎక్కారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ లో వారిని చూసిన జనం నవ్వుకోవడం మొదలుపెట్టారు. మెట్రో రైలు ఎక్కాక వారిని చూసిన తోటి ప్రయాణికులు మరింత బిత్తరపోయారు. అమ్మాయిలే అబ్బాయిల్లా టీషర్టులు, ప్యాంట్స్, షర్ట్స్ ధరించి కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్న ఈ రోజుల్లో వీళ్లేంటి ఇలా స్కర్ట్స్ ధరించి జనం మధ్యలోకి వచ్చారు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. 

స్కర్ట్స్ ధరించి మెట్రో రైలులో ఎక్కిన ఈ ఇద్దరి యువకులు.. జనం తమని చూస్తున్న తీరును కూడా తమ కెమెరాల్లో బంధించి, దానినే ఒక వీడియోగా తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది వీళ్ల ప్రవర్తనను లైట్ తీసుకోగా.. ఇంకొంతమంది తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదేం పోయే కాలం గడ్డం, మీసాలు పెంచుకుని ఇలా స్కర్ట్స్ వేసుకుని తిరగడానికి సిగ్గేయడం లేదా అని ఇంకొంత మంది చిరాకు పడుతున్నారు.

Trending News