Guru Transit 2024: 2024 సంవత్సరంలో జరిగే గురు గ్రహ సంచారం చాలా పవర్ ఫుల్..ఈ 3 రాశులకు 100% అదే జరగబోతోంది..

Guru Transit 2024: 2024 సంవత్సరంలో జరగబోయే గురుగ్రహ సంచారం కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 09:46 AM IST
Guru Transit 2024: 2024 సంవత్సరంలో జరిగే గురు గ్రహ సంచారం చాలా పవర్ ఫుల్..ఈ 3 రాశులకు 100% అదే జరగబోతోంది..

 

Guru Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం ఐశ్వర్యం వైభవం విలాసం సంపదకు సూచికగా భావించే గురుగ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం రాశి సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. గురుగ్రహం 2024 సంవత్సరం మే 1వ తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం రాత్రి 10 గంటలకు జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం శుభ సూచికగా భావించి ఈ గురు గ్రహ సంచారం జాతకాల్లో స్థానాలను బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. గురుగ్రహం సంచారం చేసిన వెంటనే మొత్తం మూడు రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారు మంచి లాభాలు పొందితే మరికొన్ని రాశుల వారు సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ సంచారంతో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశుల వారిపై గురుగ్రహ ప్రత్యేక ప్రభావం:
మేష రాశి వారికి గురు గ్రహ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మేష రాశి వారికి అదృష్టం రెట్టింపు అవ్వడమే కాకుండా సమస్యలన్నీ దూరమవుతాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గృహస్పతి సంచారం కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్ లో కూడా మార్పులు వస్తాయి. ఇక గత కొంతకాలం నుంచి శుభకార్యాల కోసమే ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో పొందుతారు. ముఖ్యంగా కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

కర్కాటక రాశి వారికి కూడా గురు గ్రహ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి రాబోయే 12 నెలల పాటు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. గురుదేవుడి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు లభించి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలోని ఆర్థిక విషయాల్లో మార్పులు చేర్పులు వస్తాయి. దీని కారణంగా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.

సింహరాశి వారికి గురుగ్రహ సంచారం చాలా అనుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి పనుల్లోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ గురు గ్రహ సంచార సమయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో బాధ్యతలు పెరిగి.. ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఆరోగ్య విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News