రంజీ ప్లేయర్లకు పండగ.. 5 కోట్ల బహుమతి

2017- 18 సంవత్సరానికి గాను రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకి ఆ టీమ్ అసోసియేషన్ భారీ నగదు పురస్కారాన్ని ప్రకటించడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దులేకుండా పోయింది. 

Last Updated : Jan 2, 2018, 03:43 PM IST
రంజీ ప్లేయర్లకు పండగ.. 5 కోట్ల బహుమతి

2017- 18 సంవత్సరానికి గాను రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకి ఆ టీమ్ అసోసియేషన్ భారీ నగదు పురస్కారాన్ని ప్రకటించడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దులేకుండా పోయింది.  రంజీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా జట్టుకు ప్రోత్సాహకంగా 5 కోట్ల రూపాయలను అసోసియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ టీమ్ సభ్యులను అభినందించారు. గత ఏడాది రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో ఢిల్లీ జట్టుపై విదర్భ భారీ స్కోరు నమోదు చేసి విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులు చేయగా.. విదర్భ 547  పరుగులు చేసింది. తర్వాత ఢిల్లీ 280 పరుగులు చేయగా.. విదర్భ ప్రతిగా 32 పరుగులు చేసి కప్ సొంతం చేసుకుంది. వసీం జాఫర్, ఉమేష్ యాదవ్ లాంటి సీనియర్ ప్లేయర్లు విదర్భ జట్టులో ఉన్నారు. చంద్రకాంత్ పండిట్ విదర్భకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 

 

Trending News