శిఖర్ ధావన్‌ స్థానంలో రిషబ్ పంత్‌కి ఐసిసి గ్రీన్ సిగ్నల్

శిఖర్ ధావన్‌ స్థానంలో రిషబ్ పంత్‌కి ఐసిసి గ్రీన్ సిగ్నల్

Last Updated : Jun 19, 2019, 11:55 PM IST
శిఖర్ ధావన్‌ స్థానంలో రిషబ్ పంత్‌కి ఐసిసి గ్రీన్ సిగ్నల్

ప్రపంచ కప్‌లో టీమిండియా జట్టు నుంచి గాయం కారణంగా శిఖర్ ధావన్ తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ని తీసుకుంటున్నట్టుగా బీసీసీఐ ప్రపంచ కప్ నిర్వాహకులు ఐసిసికి తెలియజేసింది. ఇదిలావుండగా తాజాగా బీసీసీఐ నిర్ణయాన్ని ఐసిసి ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది. ఈమేరకు ఐసిసి నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 

ఇదిలావుంటే, తనకు కష్టకాలంలో అండగా నిలిచి మద్దతు పలికిన అభిమానులకు శిఖర్ ధావన్ కృతజ్ఞతలు తెలియజేశాడు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేసిన శిఖర్ ధావన్.. తాను దేశం కోసం ఆడాలని ఎంతో తపించానని, కానీ బొటనవేలి గాయం ఇంకా తగ్గని కారణంగా భారత్‌కి తిరిగిరాకతప్పడం లేదని ధావన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అంతేకాకుండా త్వరగా కోలుకుని తర్వాతి సెలెక్షన్స్‌కి ఎంపిక అయ్యేందుకు ప్రయత్నిస్తానని ధావన్ స్పష్టంచేశాడు.

Trending News