IND vs NZ 3rd T20I : టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ గెలిచేనా ?

టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ గెలిచేనా ?

Last Updated : Feb 10, 2019, 12:55 PM IST
IND vs NZ 3rd T20I : టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ గెలిచేనా ?

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, న్యూజీలాండ్ జట్లు చివరి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెల్చుకుని 1-1తో సమానంగా నిలవగా నేడు జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి వుంది. ఈడెన్ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

భారత్ తరపున రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోని, డి కార్తిక్, హార్ధిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మెద్ ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఈ 3వ టీ20లోకి భారత్ తరపున కుల్దీప్ యాదవ్ వచ్చిచేరగా న్యూజీలాండ్ తరపున బ్లెయిర్ టిక్నర్ తొలిసారి టీ20ఇంటర్నేషనల్‌‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు.

కివీస్ జట్టు తరపున సీఫెర్ట్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, డి మిచెల్, రోస్ టేలర్, సి డి గ్రాండ్‌హోమ్, ఎం శాంటర్, ఎస్ కుగ్లీన్, టిమ్ సౌతీ, ఐ సోది, బ్లెయిర్ టక్నర్ బరిలోకి దిగుతున్నారు.

Trending News