8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలుపొందిన కోల్‌కతా

రాజస్తాన్‌పై విజయం సాధించిన కోల్‌కతా 

Last Updated : Apr 7, 2019, 11:46 PM IST
8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలుపొందిన కోల్‌కతా

జైపూర్: ఐపిఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఆదివారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన 21వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమిపాలైంది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్‌మేన్‌లో జోస్ బట్లర్ 37, స్టీవెన్ స్మిత్ 73 (59 బంతుల్లో 7X4, 1X6) పరుగులు చేయడంతో జట్టు ఒకింత గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.

అనంతరం 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 

Trending News