అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించిన ధోనీ

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ

Last Updated : Jul 24, 2018, 01:49 PM IST
అత్యధిక మొత్తంలో పన్ను చెల్లించిన ధోనీ

జార్ఖండ్‌లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిలో అందరికన్నా ముందు నిలిచాడు టీమిండియా మాజీ కెప్టేన్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12.17 కోట్ల ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా ఆ రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో ధోనీ అగ్రభాగాన నిలిచాడు. ప్రభాత్ కబర్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ధోనీ ఇప్పటికే రూ.3 కోట్ల అడ్వాన్స్ టాక్స్ సైతం చెల్లించినట్టు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ వి మహాలింగం మాట్లాడుతూ అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ధోనీ రూ.10.93 కోట్ల పన్ను చెల్లించారని, కాకపోతే.. ఆ ఏడాది అత్యధిక పన్ను చెల్లించిన వారిలో ధోనీ ముందు వరుసలో లేరని తెలిపారు. 

టీమిండియాకు మాజీ కెప్టేన్ అయిన ధోనీ అనేక రకాల బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ సంపాదనలోనూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రీడాకారులకన్నా ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x