వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమిపై స్పందించిన ప్రధాని మోదీ

వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమిపై స్పందించిన ప్రధాని మోదీ

Last Updated : Jul 10, 2019, 11:30 PM IST
వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమిపై స్పందించిన ప్రధాని మోదీ

ఐసిసి ప్రపంచ కప్ మ్యాచ్‌లలో తిరుగులేని జట్టుగా దూసుకుపోతుందనుకున్న టీమిండియా కీలకమైన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలవడం టీమిండియా అభిమానులను, క్రికెట్ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేసింది. న్యూజిలాండ్‌తో రిజర్వ్ డే మ్యాచ్ ఆడేవరకు టీమిండియా ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించిన వారే ఇప్పుడు టీమిండియాపై దుమ్మెత్తిపోస్తున్నారు. న్యూజిలాండ్‌పై గెలిచి ఫైనల్స్‌కి చేరుతుందని కలలు కన్నవారంతా ఈ ఓటమితో ఒక్కసారిగా తమ కల చెదిరిందే అని డీలా పడిపోయారు.

తాజాగా టీమిండియా ఓటమిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ... టీమిండియా ఓటమి నిరాశకు గురిచేసినప్పటికీ.. చివరి వరకు జట్టు పోరాట పటిమను కొనసాగించిన తీరు గొప్పగా ఉందని అన్నారు. టోర్నమెంట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చూపించడం గర్వంగా ఉందన్న మోదీ.. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని అభిప్రాయపడ్డారు. టీమిండియాకు భవిష్యత్‌లో అన్ని విజయాలే ఎదురవాలని ఆశిస్తున్నట్టుగా మోదీ ట్వీట్ చేశారు.

Trending News