Rishabh Pant Car Accident: మన్సూర్ పటౌడీ నుంచి ఆండ్రూ సైమండ్స్ వరకు.. రోడ్డు ప్రమాదంకు గురైన క్రికెటర్లు వీరే!

Indian Cricketers Who Injured In Road Accidents. రిషబ్‌ పంత్ భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకుని చనిపోయిన ఐదుగురు క్రికెటర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 30, 2022, 07:13 PM IST
  • రోడ్డు ప్రమాదంకు గురైన రిషబ్‌ పంత్‌
  • మన్సూర్ పటౌడీ నుంచి ఆండ్రూ సైమండ్స్ వరకు
  • రోడ్డు ప్రమాదంకు గురైన క్రికెటర్లు వీరే
Rishabh Pant Car Accident: మన్సూర్ పటౌడీ నుంచి ఆండ్రూ సైమండ్స్ వరకు.. రోడ్డు ప్రమాదంకు గురైన క్రికెటర్లు వీరే!

Here is List of Cricketers Who Injured In Road Accidents: టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు ఢిల్లీ నుంచి  ఉత్త‌రాఖండ్‌ వెళుతుండగా.. రూర్కీ సమీపంలో పంత్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న వారు పంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పంత్ భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో ప్రమాదంకు గురైన క్రికెటర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. 

మన్సూర్ పటౌడీ: 
భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మన్సూర్ పటౌడీ 1 జూలై 1961న ఇంటికి వెళ్తుండగా ప్రమాదంకు గురయ్యారు. ఆయన ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. పటౌడీని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతని కుడి కన్ను తీవ్రంగా గాయపడడంతో.. చూపు మందగించింది.

రునాకో మోర్టన్:
2012లో ట్రినిడాడ్‌లో ఒక మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రునాకో మోర్టన్ స్వదేశానికి తిరిగి వెళుతుండగా విషాదకరంగా మరణించారు. కారు స్తంభానికి ఢీకొనడంతో మృతి చెందారు. 30 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. 

కోలీ స్మిత్:
వెస్టిండీస్ ప్లేయర్ కోలీ స్మిత్ 26 సంవత్సరాల వయస్సులో 1959లో కారు ప్రమాదంలో మరణించారు. కోలీ తన సహచరులు టామ్ డ్యూడ్నీ మరియు గ్యారీ సోబర్స్ ఓ ఛారిటీ గేమ్ కోసం లండన్‌కు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. స్టాఫోర్డ్‌షైర్‌లో పశువుల ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో స్మిత్ కోమాలోకి వెళ్లారు.

సాయిరాజ్ బహుతులే:
మాజీ భారత స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే కేవలం 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కారు ప్రమాదానికి గురైంది. 28 జూలై 1990న బహుతులే స్నేహితులలో ఒకరు చనిపోయారు. కారు ప్రమాదంలో సాయిరాజ్ కుడి కాలికి ఉక్కు కడ్డీని అమర్చారు. ఒక సంవత్సరం తర్వాత అతను తిరిగి క్రికెట్ ఆడారు.

ఆండ్రూ సైమండ్స్:
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ 2022 మే 16న కారు ప్రమాదంలో మరణించారు. అతని స్వస్థలమైన క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే వెలుపల జరిగిన ప్రమాదంలో 46 ఏళ్ల సైమండ్స్ మరణించారు. 

Also Read: Cheap Hyundai Creta Cars: రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ లేదు.. రూ. 7 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి!  

Also Read: Rishabh Pant Accident: ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కారు భద్రతా ఫీచర్లు ఇవే.. ధర కోటి కంటే ఎక్కువ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News