విరాట్ కోహ్లికి విశ్రాంతి, రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు

న్యూజిలాండ్‌తో చివరి 2 వన్డేలు, టీ20 సిరీస్‌‌కు విరాట్ కోహ్లి దూరం

Last Updated : Jan 24, 2019, 01:13 PM IST
విరాట్ కోహ్లికి విశ్రాంతి, రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా అక్కడ 5 మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇవాళే ప్రారంభమైన ఈ సిరీస్ తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించగా మరో 4 మ్యాచ్‌లు మిగిలివున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసిస్ పర్యటనతో అలిసిపోయి వున్న భారత జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం కోసం ఈ సిరీస్‌లో చివరి 2 మ్యాచ్‌లకు గాను కోహ్లికి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. వన్డే సిరీస్‌లోని చివరి 2 వన్డే మ్యాచ్‌లతోపాటు ఆ తర్వాతి టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ నుంచి కూడా కోహ్లికి విశ్రాంతి ఇస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. 

కోహ్లీ స్థానంలో అతడికి బదులుగా రోహిత్ శర్మ జట్టుకు నేతృత్వం వహిస్తాడని ఈ సందర్భంగా బీసీసీఐ స్పష్టంచేసింది.

Trending News