వర్షం కారణంగా నిలిచి, మళ్లీ ప్రారంభమైన వెస్టిండీస్ vs ఇండియా 3వ వన్డే మ్యాచ్

వర్షం కారణంగా నిలిచి, మళ్లీ ప్రారంభమైన వెస్టిండీస్ vs ఇండియా 3వ వన్డే మ్యాచ్

Last Updated : Aug 14, 2019, 07:48 PM IST
వర్షం కారణంగా నిలిచి, మళ్లీ ప్రారంభమైన వెస్టిండీస్ vs ఇండియా 3వ వన్డే మ్యాచ్

వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఆఫ్ ఓవల్‌లో జరుగుతున్న 3వ వన్డే వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 1.3 ఓవర్లకు విండీస్ 6 పరుగుల స్కోర్ వద్ద వర్షం అంతరాయం కలిగించడంతో కొద్దిసేపు నిలిచిపోయిన మ్యాచ్ వర్షం వెలిసిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. 

అయితే, అంతకన్నా ముందుగా టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టేన్ జాసన్ హోల్డర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్ తరపున క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ ఓపెనర్లుగా క్రీజులోకి రాగా భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్‌ను విజయవంతంగా మెయిడెన్ చేశాడు.

Trending News