WTC Final 2021: ఆ సిరీస్‌లో Team India విజయాన్ని జీవితంలో మరిచిపోలేను, Ajinkya Rahane

WTC Final 2021: ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. బంతి శరీరానికి దగ్గరగా వచ్చినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ.టీవీతో మాట్లాడుతూ Team India వైస్ కెప్టెన్ అజింక్య రహానే పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 14, 2021, 01:45 PM IST
WTC Final 2021: ఆ సిరీస్‌లో Team India విజయాన్ని జీవితంలో మరిచిపోలేను, Ajinkya Rahane

WTC Final 2021: ఇంగ్లాండ్ గడ్డపై ఊహించని తీరుగా దూసుకొస్తున్నా బ్యాట్స్‌మెన్ మాత్రం సవాళ్లను స్వీకరించడంతో టీమిండియా విజయాలు సాధించిందని వైస్ కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం చాలా గర్వంగా ఉందన్నాడు రహానే.

శరీరానికి దగ్గరగా బంతి వస్తుంటే ఆటడం బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టం. కానీ ఇంగ్లాండ్ గడ్డపై ఆ సవాళ్లను స్వీకరించి విజయం సాధించాం. ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. బంతి శరీరానికి దగ్గరగా వచ్చినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ.టీవీతో మాట్లాడుతూ టీమిండియా (Team India) వైస్ కెప్టెన్ అజింక్య రహానే పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఓ ఆటగాడు 70 లేదా 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలోనూ ఔట్ కావడానికి కేవలం ఒక్క బంతి చాలని తాను భావిస్తానని చెప్పాడు.

Also Read: WTC Final 2021: ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో బౌలింగ్‌కు సై అంటున్న Team India కెప్టెన్ Virat Kohli

జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా తలపడనుంది. గత రెండేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత జట్టుకు పైనల్ ఆడే అర్హత ఉందన్నాడు. గత రెండేళ్లుగా టీమిండియా పలు దేశాలలో స్థిరంగా రాణించిందని, ఏ ఆటగాడిలోనైనా టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీస్తుందని చెప్పాడు. వెస్టిండీస్ సిరీస్ నుంచి నేటి వరకు ఎంతో నేర్చుకున్నాం. విజయాలను అందుకున్నామని, తుది పోరుకు జట్టు సిద్ధంగా ఉందని అజింక్య రహానే తెలిపాడు.

Also Read: French Open 2021 Winner Female: ఫ్రెంచ్ ఓపెన్ విజేత Barbora Krejcikova, 40 ఏళ్ల తర్వాత చెక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, జట్టు ఆటగాళ్లు సైతం ఈ తదుపరి మ్యాచ్‌ను కేవలం మరో మ్యాచ్‌గా భావిస్తారా అనే ప్రశ్నకు రహానే స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వ్యక్తిగతంగా తాను ఎంతో ఆనందంగా ఉన్నానని, ఫలితం ఎలా ఉన్నా అత్యుత్తమ ప్రదర్శన చేయడం తమ పని అని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ పెటర్నిటీ సెలవులో వెళ్లిన సమయంలో జట్టుకు సారథ్యం వహించిన రహానే ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ విజయాన్ని అందించా ఔరా అనిపించాడు. అది తన జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని సిరీస్ అని రహానే వ్యాఖ్యానించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News