Vistara Airlines: విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఇక విమానంలో కూడా ఇంటర్నెట్ ఎంజాయ్ చేయవచ్చు. విస్తారా ఎయిర్లైన్స్ ప్రయాణీకులకు వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Full Emergency At Delhi Airport: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో పూర్తిస్థాయిలో ఎమర్జెన్సీ విధించారు. అందుకు కారణం ఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్లే ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థకు చెందిన ఫ్రైట్ క్యారియర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొంది.
Omicron scare, IndiGo cancel 20% flights : దేశంలో పెరిగిపోతోన్న కోవిడ్ కేసుల దృష్ట్యా 20 శాతం విమానాలను రద్దు చేసిన ఇండిగో. ఫ్లైట్స్ బుకింగ్స్లో ఫ్రీగా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించిన ఇండిగో.
Aviation fuel: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో.. విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్లైన్స్ సంస్థలకు పెనుభారంగా మారాయి. అయితే ఇంధనం ఖర్చును తగ్గించేందుకు ఓ భారత శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు బృందం శుభవార్త చెప్పింది. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని పేర్కొంది.
Flight stuck under bridge, Watch this viral video: ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వీడియో ఒకటి నిన్న ఆదివారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో విమానం ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి ఉండగా.. ఆ పక్కనుంచే రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం గమనించవచ్చు.
భారత్ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China )రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్గా నిర్థారణ అయింది. భారత్లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధం కొనసాగించకతప్పదని కేంద్రం నిర్ణయించింది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు ( International flights ) ప్రారంభమయ్యేదెప్పుడు అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అనేక ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 4 నెలల క్రితం నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ ( Lockdown ) మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ( PM Modi`s video conference ) ద్వారా సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రాల్లో నెలకొన్ని పరిస్థితులు, చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపైనా ( Lockdown extension ) ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
లాక్డౌన్ల కారణంగా విమానాల రాకపోకలు రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలా విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను మే 7 తర్వాత నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం తగిన ఏర్పాట్లు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.