Osmania Hospital: ప్రజలకు వైద్యపరంగా గుడ్‌న్యూస్‌.. 15 రోజుల్లో ఉస్మానియాకు కొత్త భవనం

New Building For Osmania Hospital: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనం రాబోతున్నది. పక్షం రోజుల్లో ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 2, 2024, 08:34 PM IST
Osmania Hospital: ప్రజలకు వైద్యపరంగా గుడ్‌న్యూస్‌.. 15 రోజుల్లో ఉస్మానియాకు కొత్త భవనం

Osmania Hospital: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ముందడుగు పడింది. అతి పురాతనమైన ఆస్పత్రి భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్‌ కొత్త భవనం నిర్మించడానికి ప్రణాళికలు రచించగా.. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే పాత భవనంలో కాకుండా కొత్త ప్రాంతంలో ఈ ఆస్పత్రి భవనం నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. 15 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Kodada: ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి భారీ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?

 

విద్యా వైద్యం సోషల్ సెక్యూరిటీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉందని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం మీడియా పాయింట్‌లో సోమవారం కీలక విషయాలు తెలిపారు. 'ఆరోగ్య శ్రీ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పేదల కోసమే' అని తెలిపారు. 50 పడకల ఆసుపత్రి ఉన్న వాటికి సైతం ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: Auto Jac Bandh: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. ఆరోజు నగరంలో ఆటోలు బంద్‌

 

'పది నిమిషాల్లోనే అంబులెన్స్ సంఘటనా స్థలానికి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. బ్లాక్ స్పాట్స్ గుర్తింపు.. అక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు' దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ప్రతీ 30 కిలో మీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలు ఉన్నట్టు నర్సింగ్ కాలేజీలు సంఖ్యల పెంచే యోచనలో ఉన్నామని చెప్పారు. రాబోయే 15 రోజుల్లో ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

'తెలంగాణ రాష్ట్రంలో మందుల కొరత లేదు' అని దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మందుల కోసం ప్రతీ నెలా రూ.50 కోట్లు నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడమే కాకుండా.. కొత్త చట్టాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 'తెలంగాణలో ఇన్‌పేషెంట్ పెరుగుతుంది. 7 వేల బెడ్స్ అవసరం ఉంది' అని చెప్పారు. వైద్య సదుపాయాల అభివృద్ధిపై తాము దృష్టి సారించామని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యారోగ్య శాఖ కొనసాగుతోందని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News