దిశ హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు

దిశపై అత్యాచారం, దారుణ హత్య ఘటనపై ఆందోళన వ్యక్తంచేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఘటన విషయంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన తీరుతో పాటు పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

Last Updated : Dec 2, 2019, 09:30 PM IST
దిశ హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు

హైదరాబాద్: దిశపై అత్యాచారం, దారుణ హత్య ఘటనపై ఆందోళన వ్యక్తంచేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఘటన విషయంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన తీరుతో పాటు పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించిన సైబరబాద్ పోలీసులు... విచారణ నిమిత్తం వారిని మరోసారి పోలీసు కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు నిందితులను 10 రోజులు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ.. షాద్‌నగర్ పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు సమర్పిస్తామని షాద్ నగర్ పోలీసులు తెలిపారు.   

ఇదిలావుంటే, మరోవైపు త్వరితగతిన కేసు విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా చూడాల్సిందిగా రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి దర్యాప్తు బృందాన్ని ఆదేశించారు. ఈ విషయమై న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పీటీఐతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x